హీరోయిన్లు కనిపించగానే వెంటపడడం చాలా కామన్. వచ్చే వ్యక్తి సెల్ఫీ కోసం వస్తున్నాడా లేక వేధిస్తాడా అనేది అర్థం కాని పరిస్థితి. మొన్నటికిమొన్న హీరోయిన్ శృతిహాసన్ ను ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో వెంబడించాడు. విమానం దిగినప్పట్నుంచి కారు ఎక్కేవరకు విడిచిపెట్టలేదు. ఇప్పుడు అలాంటి అనుభవమే హీరోయిన్ ప్రియాంక మోహన్ కు ఎదురైంది.
చెన్నైలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లింది ప్రియాంక మోహన్. అప్పుడే అగంతకుడు ఆమెకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించాడు. బౌన్సర్లు ఉండడంతో ప్రియాంక తప్పించుకుంది. అయితే అక్కడితో అయిపోలేదు సదరు వ్యక్తి ప్రియాంకను ఫాలో అయ్యాడు. షాపింగ్ మాల్ నుంచి ఇంటి వరకు వచ్చేశాడు
అంతేకాదు, ఆ మరుసటి రోజు ఓ ఫంక్షన్ లో కూడా ప్రియాంక మోహన్ వెంటపడ్డాడు. ఇదంతా ఓ కంట కనిబెడుతున్న ప్రియాంక, అతడ్ని దగ్గరకు పిలిచింది. తనను ఫాలో అవ్వొద్దని కాస్త గట్టిగానే హెచ్చరించింది. తనకు సెల్ఫీ కావాలని ఆ వ్యక్తి అడగడంతో, అతడితో సెల్ఫీ దిగిన ప్రియాంక, మరోసారి సున్నితంగా వార్నింగ్ ఇచ్చి పంపించేసింది.
చాలామంది హీరోయిన్లకు ఇలాంటివి అనుభవాలు కొత్త కాదు. సరిపోదా శనివారం సినిమాతో తెలుగులో పాపులర్ అయింది ప్రియాంక. ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్ సరసన ఓజీ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…