రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య ఇప్పుడు మునుపటి “ఫ్రెండ్షిప్” లేదు. మరీ ముఖ్యంగా ఇటీవల వీరి మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. దానికి తోడు అగ్గిలో ఆజ్యం పోసినట్లు, రవితేజ కొత్త సినిమా “మిస్టర్ బచ్చన్” పూరి తీస్తున్న “డబుల్ ఇస్మార్ట్”కి పోటీగా విడుదల అవుతోంది. ఉన్నట్టుండి రవితేజ “మిస్టర్ బచ్చన్” సినిమాని తన సినిమాకి పోటీగా నిలపడం పూరికి కోపం తెప్పించింది.
ఆదివారం (ఆగస్టు 4) నాడు “డబుల్ ఇస్మార్ట్” ట్రైలర్ ని విశాఖపట్నంలో విడుదల చేశారు. అక్కడ జరిగిన ఈవెంట్ లో పూరి జగన్నాథ్ కెరీర్ పై ఒక వీడియోని ప్రదర్శించారు. ఐతే, ఆ వీడియోలో రవితేజకు సంబంధించిన విజువల్ కూడా లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పడ్డాయి. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ ఈ విషయాన్ని చెప్తున్నారు.
రవితేజతో పూరి నాలుగు సినిమాలు తీశారు. “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం”, “ఇడియట్”, “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి”, “దేవుడు చేసిన మనుషులు”. రవితేజ హీరోగా నిలబడింది పూరి సినిమాల వల్లే. కానీ ఇప్పుడు వారి మధ్య గ్యాప్ అలా పెరిగింది.
“డబుల్ ఇస్మార్ట్”తో రవితేజ “మిస్టర్ బచ్చన్” పోటీ పడుతుండడం కారణంగానే పూరి ఇలా రవితేజ విజువల్ ని కనిపించకుండా చేశారని అంటున్నారు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…