‘పుష్ప-2’ టికెట్ రేట్స్ పై ఇప్పుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది. దీనికి కారణం ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచడమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ‘పుష్ప-2’ టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.
ముందుగా తెలంగాణ విషయానికొస్తే.. ఈ సినిమా ప్రీమియర్స్ కు ఏకంగా 1200 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇదేదో బ్లాక్ లో రేటు కాదు. ప్రభుత్వ అనుమతితో నిర్మాతలు అధికారికంగా ఫిక్స్ చేసిన రేటు. దీంతో ఈ టికెట్ రేటు బ్లాక్ లో 2500 రూపాయలైంది.
అటు ఏపీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ప్రభుత్వ అనుమతితో ప్రీమియర్ షోకు ఏకంగా 800 రూపాయల టికెట్ ఫిక్స్ చేశారు. జీఎస్టీతో కలిపి రేటు అటుఇటుగా 900 అవుతుంది. బ్లాక్ లో ఈ సినిమా టికెట్ ను 1600 నుంచి 2వేల రూపాయల మధ్యలో అమ్ముతున్నారు.
ఇక ‘పుష్ప-2’కు అత్యథిక టికెట్ రేటు ఎక్కడుందో తెలుసా? ముంబయిలోని బీకేసీలో ఉన్న జియో పీవీఆర్ వరల్డ్ లో టికెట్ ధర అక్షరాలా 3వేల రూపాయలుంది. ఇటు బెంగళూరులో ఈ సినిమా టికెట్ రేటు (ప్రీమియర్స్ కాకుండా) 2500 రూపాయలు ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…