ప్రస్తుతం మనదేశంలో అధికార బీజేపీ భావజాలానికి అనుగుణంగా సినిమాల రూపకల్పన జోరుగా సాగుతోంది. తెలుగు సినిమా రంగం ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. బాలీవుడ్ దానికి మరింత ఊపుతీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని సినిమా పరిశ్రమల్లో “రైట్ వింగ్” ఐడియాలజీ (బీజేపీ అనుకూల) ప్రకారం అనేక సినిమాలు రూపొందుతున్నాయి. ఇవి విజయాలు కూడా పొందుతున్నాయి. దాంతో, హీరోలు, దర్శక, నిర్మాతలు వీటిపైనే ఫోకస్ పెట్టారు.
ఇక కన్నడ హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదగడంలో ఇదే సరయిన పద్దతి అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే “కాంతార” సినిమాతో దేశమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. దాంతో, ఈ తరహా సినిమాలకు ఫెవరేట్ నటుడిగా మారిపోయారు.
తాజాగా అతను “కాంతార” ప్రీక్వెల్ లో నటిస్తున్నారు. అది వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఇక ఆ తర్వాత “హనుమాన్”కి సీక్వెల్ గా రూపొందే “జై హనుమాన్”లో నటిస్తారు. అది 2026లో రిలీజ్ కానుంది. ఇక 2027లో విడుదల అయ్యే కొత్త సినిమాని ప్రకటించారు. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసే సినిమా… The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj. ఆ మూవీని ఈ రోజు ప్రకటించారు.
ఇలా వరుసగా రెండు భక్తి చిత్రాలు, ఒక శివాజీ మహారాజ్ బయోపిక్ లైన్లో పెట్టి తన ఉద్దేశాలు, లక్ష్యాలు స్పష్టంగా పేర్కొన్నారు రిషబ్ శెట్టి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…