ప్రస్తుతం మనదేశంలో అధికార బీజేపీ భావజాలానికి అనుగుణంగా సినిమాల రూపకల్పన జోరుగా సాగుతోంది. తెలుగు సినిమా రంగం ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. బాలీవుడ్ దానికి మరింత ఊపుతీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని సినిమా పరిశ్రమల్లో “రైట్ వింగ్” ఐడియాలజీ (బీజేపీ అనుకూల) ప్రకారం అనేక సినిమాలు రూపొందుతున్నాయి. ఇవి విజయాలు కూడా పొందుతున్నాయి. దాంతో, హీరోలు, దర్శక, నిర్మాతలు వీటిపైనే ఫోకస్ పెట్టారు.
ఇక కన్నడ హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదగడంలో ఇదే సరయిన పద్దతి అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే “కాంతార” సినిమాతో దేశమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. దాంతో, ఈ తరహా సినిమాలకు ఫెవరేట్ నటుడిగా మారిపోయారు.
తాజాగా అతను “కాంతార” ప్రీక్వెల్ లో నటిస్తున్నారు. అది వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఇక ఆ తర్వాత “హనుమాన్”కి సీక్వెల్ గా రూపొందే “జై హనుమాన్”లో నటిస్తారు. అది 2026లో రిలీజ్ కానుంది. ఇక 2027లో విడుదల అయ్యే కొత్త సినిమాని ప్రకటించారు. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసే సినిమా… The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj. ఆ మూవీని ఈ రోజు ప్రకటించారు.
ఇలా వరుసగా రెండు భక్తి చిత్రాలు, ఒక శివాజీ మహారాజ్ బయోపిక్ లైన్లో పెట్టి తన ఉద్దేశాలు, లక్ష్యాలు స్పష్టంగా పేర్కొన్నారు రిషబ్ శెట్టి.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…