తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఆ సినిమా తర్వాత మరికొన్ని పెద్ద సినిమాలొచ్చినప్పటికీ, రాజమౌళి మూవీని మాత్రం ఏవీ క్రాస్ చేయలేకపోయాయి. ఇప్పుడు ‘పుష్ప-2’ వంతు వచ్చింది. మరి ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ను క్రాస్ చేస్తుందా..?
ఏపీ-నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మొదటి రోజు 74 కోట్ల 11 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో “దేవర”, “సలార్”, “కల్కి” సినిమాలు ఉన్నాయి.
మరికొన్ని రోజుల్లో రాబోతున్న ‘పుష్ప-2’ సినిమా ఓపెనింగ్స్ లో ఏ స్థానంలో నిలుస్తుంది? ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70శాతం స్క్రీన్స్ దీనికే కేటాయించారు.
దీనికితోడు ముందు రోజు నుంచే ప్రీమియర్స్ మొదలుపెట్టారు. వాటికి అధికారికంగా 800 నుంచి వెయ్యి రూపాయలకు వరకు టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. రాత్రి గం.9.30, అర్థరాత్రి 1.30 గంట, ఉదయం 5.30 గంటలు.. షోలు నడిపించబోతున్నారు. ఇలా భారీ స్క్రీన్స్, భారీ టికెట్ రేట్లు కారణంగా.. ఏపీ-నైజాంలో ‘పుష్ప-2’ సినిమాకు భారీగా వసూళ్లు వస్తాయని, షేర్ ‘ఆర్ఆర్ఆర్’ను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…