హీరో రాజ్ తరుణ్ కు ప్రాణహాని ఉందంటూ అతడి తరఫు లాయర్ నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లాయర్ మధు శర్మ, ఆ మేరకు కొన్ని సాక్ష్యాల్ని పోలీసులకు సమర్పించారు. రాజ్ తరుణ్ కు భద్రత కల్పించాలని కోరారు.
“రాజ్ తరుణ్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇంటికి వెళ్లి తలుపులు కొడుతున్నారు. రాజ్ తరుణ్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఓ మంచి హీరో తనకుతాను చనిపోయేంత మానసిక స్థితికి ఆమె చేరుస్తున్నారు. రాజ్ తరుణ్ తెరపైన మాత్రమే కాదు, బయట కూడా రియల్ హీరో. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ మాఫియా హతమార్చాలని చూస్తోంది.”
తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని, డ్రగ్స్ కొనాలంటూ బలవంతం చేస్తోందంటూ ఇద్దరు వ్యక్తులు ఈ రోజు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లావణ్యతో తమకు మూడేళ్లుగా పరిచయం ఉందని, ఈమధ్య తరచుగా ఫోన్లు చేసి డ్రగ్స్ కొనుగోలు చేయమని బలవంతం చేస్తోందని, తమ మొబైల్స్ కూడా ఆమె దగ్గరే ఉన్నాయంటూ ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…