గోపీచంద్ తో ‘విశ్వం’ సినిమా చేశాడు శ్రీనువైట్ల. ఈ మూవీ తర్వాత అతడు ఏం చేయబోతున్నాడు? ‘విశ్వం’ రిజల్ట్ చూసి కొత్త సినిమా ప్రకటిస్తాడా? లేక ఆల్రెడీ మరో సినిమా పనిలో ఉన్నాడా?
దీనికి సంబంధించి అతడు వివరాలు వెల్లడించాడు.
“వెంకీ లాంటి సినిమా తీస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకునే సినిమా వస్తోంది. ఇంకా చెప్పాలంటే వెంకీ ఫస్టాఫ్ లో కామెడీ పీక్ లో ఉంటుంది. సెకండాఫ్ లో క్రైమ్ వల్ల కొంచెం కామెడీ తగ్గుతుంది. కానీ నెక్ట్స్ నేను చేయబోయే సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంటుంది. ఫస్టాఫ్ లో ఎంత కామెడీ ఉంటుందో, దానికి మించిన కామెడీ సెకెండాఫ్ లో ఉంటుంది.”
‘వెంకీ’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తన కొత్త సినిమాకు కథ రాసుకున్నానని, వెంకీ కంటే బెటర్ గా అది ఉంటుందని చెబుతున్నాడు వైట్ల.
అయితే అది ‘వెంకీ’ సినిమాకు పార్ట్-2 మాత్రం కాదని, పూర్తిగా కొత్త కథ అని కూడా క్లారిటీ ఇచ్చాడు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…