సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్, దాదాపు 5 నెలలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా బాలుడ్ని డిశ్చార్జ్ చేశారు. అయితే అతడు నేరుగా ఇంటికెళ్లడం లేదు. బాబును రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించబోతున్నారు.
గాయపడినప్పట్నుంచి కిమ్స్ లోనే చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ. రీసెంట్ గా అతడికి కృత్రిమ శ్వాస అందించడం నిలిపేశారు. తనకుతానుగా శ్వాస తీసుకుంటున్నాడు. పైగా వైద్యులు చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా స్పందిస్తున్నాడు.
కాబట్టి అతడ్ని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి రోబోటిక్ ఫిజియోథెరపీ అందిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తనకుతానుగా శ్వాస తీసుకుంటున్న శ్రీతేజ్, ఇంకా కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టడం లేదు. పైగా ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాడు. పైప్ ద్వారానే అతడికి ఆహారం అందిస్తున్నారు. ఫిజియోథెరపీ తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కొడుకును రక్షించే క్రమంలో ఆమె మరణించింది. ఆ ఘటనలో ఆక్సిజన్ అందక శ్రీతేజ్ మెదడు భాగం దెబ్బతింది. అతడు కోలుకోవడానికి మరికొన్ని నెలల సమయం పట్టొచ్చని చెబుతున్నారు వైద్యులు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…