సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్ అట్టుడికిపోతోంది. రోజుకో అప్ డేట్, కొత్త ట్విస్ట్ తో ఈ కేసు పరుగులు పెడుతోంది. మొన్నటివరకు సింపతీ అందుకున్న రియా చక్రబొర్తిపై ఇప్పుడు అనుమానాలు రేకెత్తేలా కథనాలు వస్తున్నాయి. మరోవైపు కంగనాకు కూడా నోటీసులు అందాయి. ఇలా రోజుకో మలుపు తీసుకుంటున్న ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటోంది సుశాంత్ చెల్లెలు. ఈ మేరకు ఆమె ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాసింది.
“నిజం వైపు నిలబడమని నా మనసు ఎప్పుడూ చెబుతుంటుంది. మేం చాలా చిన్న సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. మా అన్నయ్యకు బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. మాకు ఇప్పటికీ అలాంటివారు ఎవ్వరూ లేరు. దయచేసి ఈ కేసుపై మీరు ఓసారి దృష్టిపెట్టాలని నా కోరిక. దీనికి సంబంధించిన ప్రతి విషయం నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా జరిగేలా చూడాలి. న్యాయం నిలబడాలని కోరుకుంటున్నాను.”
ఇలా మోడీని, పీఎంవో ఆఫీస్ ను ట్యాగ్ చేస్తూ సుశాంత్ చెల్లెలు శ్వేతా సింగ్ ఓపెన్ లెటర్ రాశారు. ఈ కేసుకు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తంచేశారు. సుశాంత్ ది కచ్చితంగా మర్డర్ అంటూ 26 పాయింట్లతో కూడిన డాక్యుమెంట్ ను ఆయన రిలీజ్ చేశారు.
కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…