విక్రమ్ సినిమా తంగలాన్ ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. తమిళ్ లో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ, తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వకుండానే రన్ ముగిసింది. ఎప్పుడైతే ఈ సినిమాను ఓటీటీకి ఇద్దామనుకున్నారో అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి.
ముందుగా వచ్చిన పుకారు ఏంటంటే.. థియేట్రికల్ రిజల్ట్ ఆధారంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో నెట్ ఫ్లిక్స్ కొర్రీ పెట్టిందట. భారీ రేటుకు కొనుగోలు చేసిన ఈ సినిమాకు అంత మొత్తం అనవసరం అనేది నెట్ ఫ్లిక్స్ మాటగా చెప్పుకొచ్చారు చాలామంది జనం.
ఓవైపు ఇదిలా నడుస్తుండగానే మరోవైపు సినిమాలో కంటెంట్ పై సదరు ఓటీటీ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వార్తలొస్తున్నాయి. సినిమాలో గొడ్డు మాంసం తినడం, గేదెను వధించడం లాంటివి నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిగా మారొచ్చని, మరోసారి రీ-ఎడిట్ చేసి, సెన్సార్ చేసి ఇవ్వాలని సదరు సంస్థ కోరినట్టు వార్తలొస్తున్నాయి.
ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. కానీ అసలైన అడ్డంకి నిజంగానే మొదలైంది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వకుండా ఆదేశించాలంటూ తమిళనాడుకు చెందిన ఓ సామాజిక వేత్త కోర్టుకెక్కాడు. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…