హీరోలలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యేది మంచు విష్ణు. అతని మాటలు, చేష్టలు అన్నీ మీమర్స్ తెగ వాడేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో మంచు విష్ణుకున్న క్రేజ్ వేరు… అదేనండి ట్రోలింగ్ విషయంలో.
ఐతే, విష్ణు మాత్రం తాను వాటిని ఇప్పుడు పట్టించుకోను అని చెప్తున్నారు. “నేను ఎలా మాట్లాడినా అందులో కొన్ని క్లిప్స్ తీసుకొని వేరే అర్థం వచ్చేలా పోస్ట్ చేస్తున్నారు. కానీ జనాలకు అర్థం అయింది. నేను చెప్తున్నది వేరు, వీళ్లు రీల్స్ గా మార్చి చేస్తున్న ట్రోల్స్ వేరు అని జనం అర్థం చేసుకుంటున్నారు,” అని విష్ణు చెప్తున్నారు.
“కన్నప్ప” సినిమాతో మన ముందుకు రానున్నాడు మంచు విష్ణు. “ఈ సినిమా విషయంలో ఎవరైనా ట్రోల్ చేసినా, సినిమాని కించపర్చేలా ప్రవర్తించినా వాళ్ళు మటాష్ అయిపోతారు,” నటుడు రఘుబాబు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో విష్ణుతో పాల్గొన్న రఘుబాబు … “కన్నప్ప” విషయంలో ట్రోలింగ్ కి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. “లేదంటే మీ ఖర్మ… శివుడు ఆగ్రహానికి గురవుతారు. శివుడికి కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. మిగతా సినిమాల గురించి ఏమైనా చేసుకోండి కన్నప్పకి ట్రోలింగ్ చెయ్యకండి,” అని రఘుబాబు అన్నారు.
ఈ సినిమాలో విష్ణు హీరోగా కాగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పెద్ద నటులు కీలక పాత్రల్లో మెరుస్తారు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…