Yash and Toxic Movie: ప్రస్తుతం ఎక్కువ క్రేజ్, హైప్ ఉన్న చిత్రం… ధురంధర్ 2. రెగ్యులర్ బాలీవుడ్ మార్కెట్ లోనే కాదు, సౌత్ ఇండియాలో కూడా “ధురంధర్ 2″పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, ఆ సినిమాతో పోటీపడేందుకు ఇతర హీరోలు భయపడుతున్నారు. మన తెలుగు హీరోలు రామ్ చరణ్, నాని, అడివి శేష్ తమ సినిమాలను మార్చి విడుదల నుంచి వాయిదా వేశారు.
“ధురంధర్” వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు అందుకొంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో కూడా బాగా పాపులర్ అయింది. అందుకే రెండో భాగమైన “ధురంధర్ 2” మార్చి 19న విడుదల అవుతోంది అంటే ఇప్పటి నుంచే క్రేజ్ ఎక్కువ అయింది.
అయినా ఈ సినిమాతో పోటీ పడే విషయంలో కన్నడ సూపర్ స్టార్ యష్ వెనక్కి తగ్గడం లేదు. తన చిత్రం “టాక్సిక్” వాయిదా వేసే ప్రసక్తి లేదు అని తేల్చేశాడు. మార్చి 19న టాక్సిక్, ధురంధర్ 2 రెండూ విడుదల కానున్నాయి.
కేజీఎఫ్ 2″ తర్వాత తనకు ఉన్న ఇమేజ్, పాపులారిటీ వేరు కాబట్టి తాను ఇంకో హీరోకి భయపడలా అని యష్ భావిస్తున్నాడు. హిందీ చిత్రాలను చూసి సౌత్ సినిమాలు వెనక్కి తగ్గకూడదు అని అంటున్నాడు యష్.
తన సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద హిట్ అవుతుంది అని యష్ అంటున్నాడు. ఈ సినిమాకి అతను సహ నిర్మాత.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…