ఎన్నికలకు ముందు బన్నీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సరిగ్గా కొన్ని రోజుల్లో పోలింగ్ ఉందనగా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు బన్నీ. ఇటు తన కుటుంబ సభ్యుడు పవన్ కల్యాణ్ కోసం ట్వీట్ వేశాడు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలంటూ ట్వీట్ వేశాడు.
ఆ వెంటనే తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లాడు. వైసీపీ తరఫున బరిలోకి దిగిన శిల్పా రవిచంద్ర తరఫున ప్రచారం చేశాడు. కట్ చేస్తే, ఇప్పుడు పవన్ కల్యాణ్ గెలిచారు. శిల్పా ఓడిపోయారు. సరిగ్గా ఇక్కడే బన్నీ ఫ్యూచర్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
త్వరలోనే జనసేన ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరుతుంది. అలా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలలకే బన్నీ నుంచి పుష్ప-2 వస్తోంది. మరి అల్లు అర్జున్ చేసిన ఈ పనికి, అతడు ఆంధ్రాలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటాడా?
ప్రస్తుతం ఇదే కోణంలో చర్చ సాగుతోంది. శిల్పా తనకు ఆప్తుడు కాబట్టి నంద్యాల వెళ్లానని, తనకు రాజకీయాలతో సంబంధం లేదని బన్నీ గతంలో తనకుతాను ప్రకటించుకున్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇవన్నీ పట్టించుకోకపోతే ఏపీ ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సమస్య ఉండదు బన్నీకి.
ఐతే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం సైలెంట్ గా ఊరుకుంటారా? ఎందుకంటే పవన్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…