అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కలెక్షన్లు అదుర్స్ అన్న రీతిలో సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల పరంగా తెలుగునాట దుమ్మురేపింది డీజే. అయితే తాజాగా ఈ సినిమాకి పైరసీ బెడద మొదలైంది.
డీజే సినిమా హై క్వాలిటీ ప్రింట్ని కొందరు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆ లింక్లను మరికొందరు ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. దాంతో వెంటనే రంగంలోకి దిగింది డీజే టీమ్. పైరసీ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్మాత దిల్రాజు, దర్శకుడు హరీష్ శంకర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్రాన్ని పైరసీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇప్పటికే పోలీసులు వారి భరతం పట్టడం మొదలుపెట్టారు.
మరోవైపు, అల్లు అర్జున్ ఈ వీకెండ్ అమెరికా వెళ్తున్నాడు. సినిమాని అక్కడ ప్రచారం చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు మిలియన్ డాలర్లకి చేరుకున్నాయి.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…