‘వెన్నుపోటు ఈటల’ తీయట్లేదు: ఆర్జీవీ

- Advertisement -
Ramuism

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హుజురాబాదు ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. దాంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. తెరాస పార్టీని చీల్చేందుకు ఈటల ప్రయత్నించారని, అది తెలిసి కేసీఆర్ ఆయనపై వేటు వేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు.

దాంతో, ఈటలపై సినిమా తాను తీయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు ఇటీవల ఒక ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఆర్జీవీ ట్వీట్ చేసి ఆ తర్వాత దాన్ని తొలగించారంటూ ఒక స్నాప్ షాట్ ని వైరల్ చేశారు. కానీ అది నిజం కాదంటున్నారు వర్మ.

“ఇది ఫేక్. అలాంటిది ఏమి లేదు,” అని వర్మ ఆ స్నాప్ షాట్ ని పోస్ట్ చేస్తూ తాజాగా ట్వీట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెలంగాణ రాజీకీయాలపై ఫోకస్ పెట్టిన మాట వాస్తవమే. కానీ ఈటలపై సినిమా తీయట్లేదని చెప్తున్నారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు బలమైన ముద్ర వేసిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులపై ‘కొండా’ పేరుతో ఒక సినిమా తీస్తున్నారు. తెలంగాణ రాజకీయనేతలపై ఆయన తీస్తున్న తొలి మూవీ ఇదే. ఇంతకుముందు ఆంధ్ర, రాయలసీమ రాజకీయాలపై చిత్రాలు తీశారు.

More

Related Stories