
ఒకప్పుడు హీరోగా వెలిగిన హీరో నరేష్ ప్రస్తుతం క్యారక్టర్ యాక్టర్ గా స్థిరపడ్డారు. బాగా ధనవంతుడు. హైదరాబాద్, బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాలు ఉన్న రిచెస్ట్ యాక్టర్ నరేష్. అంతే కాదు, ఈ నటుడికి పెళ్లిళ్లు కూడా ఎక్కువే. ఆయన మూడో భార్య రమ్య కారణంగా ఇప్పుడు నరేష్ ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు.
నరేష్ పేరు రమ్య రఘుపతి చాలామంది దగ్గర డబ్బులు వసూళ్లు చేశారట. ఆమె చేతిలో మోసపోయిన ఐదురుగురు మహిళల ఫిర్యాదు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదైంది.
ప్రముఖ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సోదరుని కుమార్తె రమ్య రఘుపతిని దశాబ్దం క్రితం పెళ్లి చేసుకున్నారు నరేష్. వీరికి ఓ కొడుకు ఉన్నాడని సమాచారం. కొన్నాళ్ళ క్రితం విభేదాలు వచ్చి విడిగా ఉంటున్నారట. నరేష్కు ఉన్న ఎకరాల కొద్దీ ఆస్తులు అన్ని నావే అంటూ ఆమె పలువురి అప్పు తీసుకొని, ఎగ్గొటినట్లు ఆరోపణ. దాంతో, ఈమె వసూళ్లతో తనకెలాంటి సంబంధం లేదని నరేష్ ప్రకటించారు.
నరేష్ కిప్పుడు 62 ఏళ్ళు. ప్రస్తుతం నరేష్ సింగిల్ గానే ఉంటున్నారని అంటున్నారు. మళ్ళీ ఆ విషయంలోనూ రకరకాల రూమర్లు కూడా ఉన్న మాట వాస్తవమే.