పంద్రాగస్ట్ నాడు ‘బాంబ్’ పేల్చనున్న కియారా!

Kiara Advani

థియేటర్లను మిస్ కొట్టి ఇప్పటివరకు చాలా సినిమాలు ఓటీటీపైకి వచ్చాయి. కానీ అతిపెద్ద మూవీ త్వరలోనే ఓటీటీపైకి రాబోతోంది. దీని పేరు “లక్ష్మీ బాంబ్”. అక్షయ్ కుమార్, కియరా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతోందనే విషయం తెలిసిందే. ఇప్పుడా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

పంద్రాగస్ట్ కానుకగా “లక్ష్మీబాంబ్” ను స్ట్రీమింగ్ కు పెట్టడానికి నిర్ణయించింది డిస్నీ హాట్ స్టార్. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను దాదాపు 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన ఈ సంస్థ.. ఓ స్ట్రయిట్ మూవీని ప్రమోట్ చేసినట్టు “లక్ష్మీబాంబ్” కు ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. ఈ మూవీకి సంబంధించి ప్రెస్ మీట్లు, లొకేషన్ టూర్స్, ఛానెల్ ఇంటర్వ్యూలు.. ఇలా అన్నీ ఉంటాయన్నమాట.

జులై చివరి వారం నాటికి ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఆగస్ట్ 15 వీకెండ్ పడింది. పైగా హాలిడేస్ కూడా కలిసొస్తాయి. అందుకే తమ సినిమాకు ఆగస్ట్ 15ను లాక్ చేసింది. వచ్చే నెల నుంచి డిస్నీకి చెందిన అన్ని ఛానెల్స్ లో ఈ సినిమా ప్రోమోలు టెలికాస్ట్ కాబోతున్నాయి.

తెలుగులో వచ్చిన “కాంచన” సినిమాకు రీమేక్ ఇది. లారెన్స్ దర్శకుడు.

Advertisement
 

More

Related Stories