ఆ పుకార్లు నమ్మొద్దు: మెహ్రీన్

Mehreen


హీరోయిన్ మెహ్రీన్ నందమూరి బాలకృష్ణ సరసన నటించనుంది అని ఇటీవల ప్రచారం జరిగింది. గోపీచంద్ మలినేని బాలయ్య తీసే సినిమాలో రెండో హీరోయిన్ గా నటించేందుకు ఆమె ఒప్పుకుందని కొన్ని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. దాంతో ఈ పుకార్లపై మెహ్రీన్ స్పందించింది.

“ప్రస్తుతం నేను మారుతి – సంతోష్ శోభన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీతో బిజీగా ఉన్నాను. మీరందరూ ఆ మూవీని ఎంత త్వరగా చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. ఇక, నా ఇతర సినిమాల గురించి వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. నేను ఇక్కడ చెప్పేంతవరకు దేన్నీ నమ్మొద్దు,” అని ఈ అమ్మడు ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

మెహ్రీన్ “ఎఫ్ 3” సినిమాలో కూడా హీరోయిన్. వరుణ్ తేజ్ సరసన కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ వారమే ప్రారంభం అవుతుంది.

కాంగ్రెస్ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ కి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఐతే, కరోనా కారణంగా ఆమె పెళ్లి వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఆమె మారుతి మూవీలో నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories