రజినీకాంత్ కి మిశ్రమ ఫలితం

Peddhanna

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’ దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలైంది. సాధారణంగా రజినీకాంత్ సినిమా అంటే తెలుగునాట కూడా చాలా హడావిడి ఉంటుంది. కానీ అది “దర్బార్”, “పెట్టా” సినిమాలతోనే పోయింది. అందుకే, ‘పెద్దన్న’ సినిమాకి ఎలాంటి హడావిడి కనిపించలేదు. విడుదల తర్వాత టాక్, రివ్యూస్ మరీ దారుణంగా ఉండడంతో ఇక తెలుగునాట ‘పెద్దన్న’ని పట్టించుకునే వారే లేకుండా పోయారు.

ఐతే, విచిత్రంగా తమిళనాట మాత్రం మంచి కలెక్షన్లు దక్కాయి. తమిళ క్రిటిక్స్ కూడా ఈ సినిమాని తేల్చి పారేశారు. కానీ, కుటుంబ ప్రేక్షకులకు, మాస్ కి సినిమా నచ్చింది.

ఇప్పటికే తమిళనాట 50 కోట్లపైనే వసూళ్లు అందుకొంది. ఈ కరోనా అనంతర కాలంలో ఇది పెద్ద మొత్తమే. ఒకప్పటి రజినీకాంత్ మేనియా ఇప్పుడు లేదు. ఆ రేంజు కలెక్షన్లు రజినీకాంత్ మూవీకి వచ్చే అవకాశం దాదాపు లేనట్లే. కానీ, ఈ టైంలో వచ్చిన ఈ వసూళ్లు ఎక్కువే. అందుకే, రజినీకాంత్ కి ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని తెచ్చిపెట్టింది.

రజినీకాంత్ ఈ సినిమా కోసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అస్సలు ప్రొమోషన్ లేదు. ఆయన అనారోగ్యం కారణంగా బయటికి రాలేదు.

Advertisement
 

More

Related Stories