తెలుగులో మృణాల్ కి క్రేజ్ పెరుగుతోంది. వరుసగా సినిమాలు లాగేసుకుంటోంది ఈ ‘సీతారామం’ సుందరి. ఇప్పటికే నాని సరసన నటిస్తోన్న ఈ బ్యూటీకి ఇప్పుడు విజయ్ దేవరకొండ చిత్రం దక్కింది.
విజయ్ దేవరకొండ హీరోగా ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ తీస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్. ఈ రోజు సినిమా ప్రారంభం అయింది. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
ఇలా ఇద్దరు క్రేజున్న హీరోల సినిమాల్లో అవకాశం పొంది ఈ భామ ఇప్పుడు మిగతా హీరోయిన్లకు సవాల్ విసిరింది. ఇంకో రెండు చిత్రాలు కూడా లాగేస్తే ఈ భామ ఇక టాప్ హీరోయిన్ల రేసులోకి వస్తుంది. బాలీవుడ్ లో కన్నా ఆమెకి ఇప్పుడు మన తెలుగునాట క్రేజ్ ఎక్కువ ఉంది. నాని సరసన, విజయ్ దేవరకొండ సరసన మెప్పిస్తే ఆమెకి ఇతర పెద్ద హీరోలు కూడ అవకాశాలు ఇస్తారు.
ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. ఒక్క శ్రీలీల అరడజను చిత్రాల్లో నటిస్తోంది. పూజ హెగ్డేకి క్రేజ్ తగ్గింది. రష్మిక అటు హిందీ, ఇటు తెలుగు అంటూ తక్కువ చిత్రాలు ఒప్పుకుంటోంది. అందుకే మృణాల్ వంటి భామలకు ఇది కలిసొచ్చింది.
ALSO READ: Vijay Deverakonda and Mrunal Thakur film launched