
హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ప్రేమించుకుంటున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓ ఈవెంట్ ఇద్దరూ చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు. ఎంతో సన్నిహితంగా మెలిగారు. దీంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.
దానికితోడు ధనుష్ సిస్టర్స్ ను సోషల్ మీడియాలో మృణాళ్ ఫాలో అవ్వడం కూడా ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చింది. ఇప్పుడీ మొత్తం ఎపిసోడ్ పై మృణాల్ స్పందించింది. ధనుష్ తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమేనని అంటోంది మృణాల్.
నిజానికి అజయ్ దేవగన్, ధనుష్ మంచి స్నేహితులంట. అందుకే అజయ్ దేవగన్ ఆహ్వానం పేరుకు హిందీ సినిమా ఫంక్షన్ కు ధనుష్ వచ్చాడని, అప్పటికే తనకు ధనుష్ తో పరిచయం ఉండడంతో ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నామని అంటోంది మృణాల్.
ALSO READ: Mrunal Thakur follows Dhanush’s sisters on Instagram
వీలైనంత త్వరగా తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని, అయితే ప్రస్తుతం తన మనసులో ఎవ్వరూ లేరని, సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టానంటోంది 32 ఏళ్ల మృణాల్.





