ఆ రాత్రి హోటల్లో…దక్షిణాది నిర్మాతతో!

Neena Gupta

బాలీవుడ్ లో ప్రస్తుతం బామ్మ, తల్లి పాత్రలు పోషిస్తున్న నీనా గుప్తా గురించి పరిచయం అక్కర్లేదు. గ్రేట్ యాక్ట్రెస్ ఆమె. ఒకప్పుడు హీరోయిన్. ‘గాంధీ’ వంటి అంతర్జాతీయ సినిమాల్లోనూ నటించారు. 1980లలో ఆర్ట్ సినిమాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నీనా గుప్తా ఆ తర్వాత బాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ ఎక్కువ ప్రజాదరణ పొందారు.

ఇప్పుడు ఆమెకి 62 ఏళ్ళు. రిటైర్మెంట్ స్టేజికి చేరుకోవడంతో ఆమె తన ఆత్మకథని విడుదల చేశారు. “సచ్ కహూ తో” (నిజంగా చెప్పాలంటే) అనే పుస్తకంలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలు రాసుకున్నారు. అందులో ఒక దక్షిణాది నిర్మాతతో ఒక రాత్రి హోటల్లో జరిగిన సంఘటనని చెప్పుకొచ్చారు.

“దక్షిణ భారతీయ సినిమాల్లో పేరున్న నిర్మాత. తన కొత్త సినిమాల్లో అవకాశం ఇస్తానని పిలిచారు. ముంబైలోనే ఒక ఫేమస్ హోటల్ లో దిగారు. నేను హోటల్ లాబీకి వెళ్లి ఫోన్ చేశాను. కానీ ఆయన తన రూమ్ కి రమ్మని చెప్పారు. జంకుతూనే వెళ్ళాను. ఎంతమంది బాలీవుడ్ హీరోయిన్లను తాను పరిచయం చేసిందో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తనకి ఒక హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర ఇద్దామని అనుకుంటున్నాను అన్నారు. చిన్న పాత్రలు చేయదలుచుకోలేదు అని చెప్పి బయలుదేరబోతుండగా… అదేంటి రాత్రికి ఇక్కడ పడుకోవా అని అడిగారు… మైండ్ బ్లాంక్ అయింది. కోపంతో బయటికి వచ్చేశాను,” అని రాసుకొంది.

ఇంతకీ ఆ నిర్మాత ఎవరో?

నీనా గుప్తా కూతురు మసబా (వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, నీనాకు పుట్టిన సంతానం) పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. తన 50వ పుట్టిన రోజు సందర్భంగా నీనా గుప్తా ఒక ఎన్నారైని పెళ్లి చేసుకున్నారు.

Advertisement
 

More

Related Stories