ప్రీతికి 20 సార్లు కరోనా టెస్ట్

Priety Zinta

అనుమానమొస్తే ఒకసారి కరోనా పరీక్ష చేయించుకుంటారు. ఇంకా ఏ మూలనైనా అనుమానం ఉంటే ఇంకోసారి టెస్ట్ చేయించుకుంటారు. కానీ హీరోయిన్ ప్రీతి జింటా మాత్రం ఏకంగా 20 సార్లు కరోనా పరీక్షలు చేయించుకుంది. బహుశా హీరోయిన్లలో తనకంటే ఎక్కువసార్లు ఎవ్వరూ కరోనా పరీక్షలు చేయించుకొని ఉండరని చెబుతోంది ఈ బ్యూటీ.

తను ఎందుకు ఇన్నిసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చిందో వెల్లడించింది ప్రీతి జింటా.

ప్రస్తుతం తను బయో బబుల్ సెగ్మెంట్ లో ఉన్నానని, ఈ ప్రొగ్రామ్ లో ఉన్న వాళ్లకు ప్రతి 3-4 రోజులకు కరోనా టెస్ట్ ఉంటుందని వెల్లడించింది. అలా తను ఇప్పటివరకు 20 సార్లు కరోనా పరీక్ష చేయించుకున్నట్టు వెల్లడించింది ప్రీతి.

“బయో బుబల్ అంటే ఏంటని అంతా అడుగుతున్నారు. 6 రోజుల క్వారంటైన్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ప్రతి 3-4 రోజులకు కరోనా పరీక్షలుంటాయి, బయటకు వెళ్లడానికి వీల్లేదు. హోటల్ గది, స్టేడియం, జిమ్ కు మాత్రమే అనుమతి. డ్రైవర్లు, వంట మనుషులు కూడా బయో బబుల్ లో ఉండాల్సిందే. బయట ఫుడ్ ఉండదు, బయట నుంచి మనుషులు రారు. నాలాంటి స్వేచ్ఛా జీవులకు ఇది కష్టమే.”

ఐపీఎల్ మ్యాచుల నిర్వహణలో భాగంగా ప్రీతి జింటా ఇలా 20 సార్లు కరోనా పరీక్షలు ఎదుర్కొంది. ఆమె కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు కో-ఓనర్ గా వ్యవహరిస్తోంది.

Advertisement
 

More

Related Stories