
బడ్జెట్ రీత్యా, కథ లెంగ్త్ పెరగడం వల్ల రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని రెండు భాగాలుగా తీశారు. అది సాహసోపేత నిర్ణయమే. కానీ ఆయన విజనరీ కదా. రాజమౌళి థాట్ వర్కవుట్ అయింది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి బాహుబలి రెండు చిత్రాలు.
అదే పద్దతిలో ఎన్టీఆర్ బయోపిక్ ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ అని రెండు భాగాలుగా మలిచారు. కానీ దర్శకుడు క్రిష్ ఐడియా వికటించింది. రెండు భాగాలూ ఢమాల్.
ఇప్పుడు, సుకుమార్ కూడా మళ్ళీ ఆ సాహసం చేసే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తి కాదు. విడుదల మరింత ఆలస్యం అవుతుంది. అందుకే ఈ మూవీని రెండు భాగాలుగా విడదీసి మొదటి భాగాన్ని ఈ ఏడాది విడుదల చేస్తే ఎలా వుంటుందనే ఆలోచన మేకర్స్ చేస్తున్నారట. అన్ని కుదిరితే మొదటి పార్ట్ ని త్వరలోనే థియేటర్లోకి దింపాలని ఆలోచన.
బాహుబలి స్టోరీకి ఉన్నంత స్కోప్ ‘పుష్ప’కి ఉందనేది డైరెక్టర్ సుకుమార్ నమ్మకం. చూడాలి ఈ వార్తల్లో నిజమెంతో? ఈ ఐడియా వర్కవుట్ అవుతుందో లేదో?