మనీల్యాండరింగ్‌ చెయ్యలేదు: రకుల్

Rakul


మీరు పిలిచిన రోజు ఈడీ విచారణకు హాజరు కాలేననని ఇంతకుముందు ఇమెయిల్ పంపిన రకుల్ నిన్న సడెన్ గా హాజరయ్యారు. ఆమెకి కేటాయించిన డేట్ కన్నా ముందే ఈడీ అధికారుల ముందుకు వచ్చి తన బ్యాంక్ లావాదేవీల పత్రాలను అందచేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 3) రకుల్‌ను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు.

ఐతే, విచిత్రంగా హైదరాబాద్ కి చెందిన డ్రగ్స్ కేసులోనూ ఆమెని బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తితో ఉన్న పరిచయాల గురించి అడిగారట. ఇంతకుముందే ముంబైలో ఎన్సీబీ అధికారులు ఆమెని ఇదే విషయంలో విచారణ జరిపారు. మళ్ళీ ఆ విషయమై ఎందుకు ప్రశ్నించారో. అలాగే, కెల్విన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన అంశాలపై అధికారులు రకుల్‌ను ప్రశ్నించారని సమాచారం.

2017కి సంబంధించిన డ్రగ్స్ కేసులో మనీ ల్యాండరింగ్ కి పాల్పడ్డారన్న కోణంలో టాలీవుడ్ ప్రముఖలను ఈడీ ప్రశ్నిస్తోంది. 12 మంది హాజరు కావాలని నోటీసులు వెళ్లాయి. అందులో ఇప్పటివరకు పూరి జగన్నాధ్, రకుల్, ఛార్మీలను ప్రశ్నించారు.

రానా, రవితేజ, తనీష్ తదితరులు తర్వాత హాజరు కావాల్సి ఉంటుంది.

Advertisement
 

More

Related Stories