మాస్ మహారాజ్ దూకుడు

Ravi Teja

రవితేజ హీరోగా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. విడుదల కావాల్సినవే రెండు ఉండగా, తాజాగా మరో కొత్త సినిమా ప్రకటన రానుంది. దర్శకుడు గోపీచంద్ మలినేనికి రవితేజ మరో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన జులై 9న వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మించనుంది.

ప్రస్తుతం రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ (అక్టోబర్ 20 విడుదల), ‘ఈగిల్’ (జనవరి 2024 విడుదల) చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత చిత్రంగా గోపీచంద్ మలినేని సినిమా రానుంది.

‘డాన్ శీను’తో గోపిచంద్ మలినేని దర్శకుడిగా మారారు. అలా రవితేజ అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు అగ్ర దర్శకుడిగా ఎదిగారు గోపీచంద్ మలినేని. ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్ మలినేని తమిళ అగ్ర హీరో విజయ్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన మాట వాస్తవం. ఐతే, అది వర్కవుట్ కాలేదు. సో, మళ్లీ రవితేజని కలిసి కథ చెప్పడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకాచకా జరిగిపోయాయి.

వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాలు వచ్చాయి. నాలుగో చిత్రంగా ఈ కొత్త సినిమా ప్రకటన రానుంది.

Advertisement
 

More

Related Stories