ట్రెండింగ్: టీవీ9 vs హరీష్ శంకర్

Harish Shankar

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణం అతివేగం అని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నమోదు చేసుకున్నారు. ఐతే, అక్కడ వేగం కన్నా రోడ్డుపై ఉన్న ఇసుక వల్లే బైక్ స్కిడ్ అయింది అనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. పరిమితి (30 కిలోమీటర్లు) కి మించి వేగం ఉందా? లేక ఇసుక వల్లే జరిగిందా? సడెన్ బ్రేక్ వెయ్యడం వాళ్ళ అయిందా అన్నది పోలీసుల విచారణలో తేలుతుంది.

కానీ, వారి విచారణకు ముందే… టీవీ9, మరికొన్ని ఛానెల్స్ సాయి ధరమ్ తేజ్ విషయంలో అతిగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. ముందే తీర్పులిచ్చేస్తున్నాయి. రెండు రోజులుగా సాయి ధరమ్ తేజ్ కి సంబంధించి రకరకాల విశ్లేషణలతో హోరెత్తిస్తున్నాయి. అందులో టీవీ9 చేస్తున్న హడావిడి జర్నలిజం విలువలకి దూరంగా సాగుతోంది అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో మాటలు వినిపిస్తున్నాయి.

అందుకే, హరీష్ శంకర్ ఛానెళ్లు చేస్తున్న అతిపై ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందించారు. టీవి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ హరీష్ ట్వీట్ కి స్పందించారు. దాంతో వీరి మధ్య ట్వీట్ల సంవాదం జరిగింది. అదిప్పుడు హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

జనరల్ గానే సెలెబ్రిటీల న్యూస్ విషయంలో టీవీ ఛానెల్స్ ముఖ్యంగా టీవీ9 హడావిడి చేస్తుంటాయి. జనాలని టీవీకి అతుక్కుపోయేలా చేసేవి అలాంటి వార్తలే. ఐతే, ఈ మొత్తం ఎపిసోడ్ లో ‘అతి’ ఎక్కువ చేశారన్న అభిప్రాయం ఉంది.

Advertisement
 

More

Related Stories