సమంత సొంత సర్కిల్

తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సమంత. తెలుగు సినిమా ఇండస్టీలో తనకంటూ సొంత సర్కిల్ క్రియేట్ చేసుకొంది. నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు అక్టోబర్ 2న ప్రకటన వచ్చింది. దాంతో, సినిమా పెద్దలు ఆమెని దూరం పెడతారని భావించారు. కానీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆమెకి మద్దతు తెలిపారు.

ఎన్టీఆర్ ఇప్పటికే ఆమెని తన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి గెస్ట్ గారప్పించారు. రామ్ చరణ్, ఆయన భార్య ఇచ్సిన దీపావళి పార్టీకి సమంత గెస్ట్ గా విచ్చేసింది.

ఆమె హైదరాబాద్ లోనే ఉంటూ తన పని తానూ చేసుకుంటూ వెళ్తోంది. అంటే, టాలీవుడ్ లో ఏ పెద్ద కుటుంబం తనని దూరం పెట్టకుండా చూసుకొంది. నాగ చైతన్యతో విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత ఆమె చైతన్యకి వ్యతిరేకంగా కానీ, నాగార్జున కుటుంబానికి ఎగైనెస్ట్ గా కానీ ఏమి మాట్లాడలేదు. అందుకే, ఇండస్ట్రీలోని వారు కూడా సమంతకి వ్యతిరేకంగా మారలేదు. భార్యాభర్తల మధ్య వచ్చిన సహజమైన విభేదాల వల్ల వారు విడిపోయారు కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని అనుకుంటున్నారు. అందుకే, సమంతకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు ఆగిపోయే పరిస్థితి లేదు.

సమంతకి శిల్పారెడ్డి మద్దతు ఉంది. శిల్పారెడ్డి భర్త ప్రీతమ్ రెడ్డి, నాగార్జున జాన్ జిగ్రీ దోస్తులు. అంటే, సమంత, అక్కినేని కుటుంబాల మధ్య ఇంకా సత్సబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories