సునీత మళ్ళీ బిజీ బిజీ

Sunitha


ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సునీత ఇక నిర్మాతగా మారనుందట. ఆమె భర్తకి ఒక పెద్ద డిజిటల్ కంపెనీ ఉంది. రీసెంట్ గా ఈ కంపెనీ చిన్నచిన్న సినిమాలు తీసి ఒటిటి కంపెనీలకు అమ్ముతోంది. ఇలాంటి సినిమాలకు సునీత నిర్మాత వ్యవహరించనున్నారట.

తన అందచందాలతో సునీత బుల్లితెరపై బోలెడు అభిమానులను పొందారు సునీత. లెజెండరీ సింగర్ బాలు చనిపోవడంతో ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్‌కు బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తో కలిసి ఆమె వ్యాఖ్యాతగా కూడా మారనున్నారు. అటు టీవీ షోలు, ఇటు ఓటిటి కంటెంట్ లతో ఆమె బిజీగా మారనున్నారన్నమాట.

అన్నట్లు రెండో భర్తతో తీసుకున్న ఫోటోలను కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు సునీత. అలా, మ్యాంగో రామ్ ని లైంలైట్ లోకి తెస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన పాపులర్. ఇప్పుడు సునీత వల్ల కామన్ పబ్లిక్ కి పరిచయం అయ్యారు రామ్.

Advertisement
 

More

Related Stories