సంక్రాంతి రేసులోకి వచ్చిన దేవరకొండ

- Advertisement -
Vijay Deverakonda


విజయ్ దేవరకొండ – పరశురామ్ సినిమా షూటింగ్ మొదలైంది. అంతే కాదు, ఈ సినిమాని సంక్రాంతి పండక్కి విడుదల చేస్తామని ప్రకటించింది నిర్మాణ సంస్థ.

విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘గీత గోవిందం’ వంటి భారీ హిట్ వచ్చింది. ఇప్పుడు కూడా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నారు.

“ఈ రోజు షూటింగ్ మొదలు పెట్టాం. సంక్రాంతి 2024 పండగకి అద్భుతమైన వినోదాన్ని పంచుతాం అని హామీ ఇస్తున్నాము,” అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్.

ఈ సినిమాని ఎక్కువభాగం అమెరికాలో తీయనున్నారు. “గీత గోవిందం”.. హైదరాబాద్, కాకినాడ నేపథ్యంగా సాగింది. ఈ సినిమా కథ మాత్రం ఫారిన్ లో జరుగుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున తీస్తున్నారు నిర్మాత దిల్ రాజు.

సంక్రాంతి 2024 రేసులో ఇప్పటికే మహేష్ బాబు – త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం”, రవితేజ “ఈగిల్”పోటీలో ఉన్నాయి. మరి ఈ సినిమా కూడా పండగ బరిలో ఉండాలంటే ఐదు నెలల్లో మొత్తం షూటింగ్ పూర్తి చెయ్యాలి.

More

Related Stories