తెలుగు మార్కెట్ పై విజయ్ ఫోకస్!

తమిళ్ లో సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ ఉన్న విజయ్ కి ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ క్రియేట్ అవుతోంది. “అదిరింది”, “విజిల్”, “మాస్టర్” సినిమాలతో తెలుగునాట కూడా ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు, తెలుగు మార్కెట్ పై మరింత ఫోకస్ పెడుతున్నాడట.

కార్తీ తన డబ్బింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెలుగులో ‘ఊపిరి’ అనే మూవీ చేశాడు. ఆ సినిమాతో తెలుగువారికి మరింత చేరువయ్యాడు కార్తీ. ఇప్పుడు విజయ్ కూడా అదే చేస్తున్నాడట. నిర్మాత దిల్ రాజు విజయ్ ని ఒప్పించాడు. వంశీ పైడిపల్లి వెళ్లి ఇటీవల విజయ్ ని కలిశాడు. కథ నచ్చితే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం చేసేందుకు రెడీ అని చెప్పాడట.

ఐతే, వంశీ పైడిపల్లి ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్లి విజయ్ ని కన్విన్స్ చెయ్యాలి. ప్రస్తుతానికి ఐతే ఈ కాంబినేషన్లో సినిమా ప్రాథమికంగా సెట్ అయినట్లే.

Advertisement
 

More

Related Stories