భీమ్లా నాయక్ తో క్రేజ్ పెరుగుతుందా?

- Advertisement -
Nithya Menen


‘భీమ్లా నాయక్’ సినిమాకి క్రేజ్ మాములుగా లేదు. ఆదివారం (ఆగస్టు 15) టైటిల్ అనౌన్స్ మెంట్, వీడియో గ్లిమ్ప్స్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇది సాలిడ్ మాస్ మూవీ అని అర్థమైంది అభిమానులకు, ట్రేడ్ కి. దాంతో ‘భీమ్లా నాయక్’లో నటిస్తున్న ఇతర తారాగణానికి కూడా క్రేజ్ పెరుగుతుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటిస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ తో నటించడం ఇదే ఫస్ట్ టైం. బాగా లావు కావడంతో నిత్య మీనన్ ని హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు రెండేళ్లుగా జంకుతున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’లో హీరోయిన్ పాత్ర రెగ్యులర్ టైప్ కాదు. అందుకే, నిత్య మీనన్ కి అవకాశం దక్కింది. అంతేకాదు, ఇప్పుడు కొంచెం తగ్గింది కూడా.

సో, భీమ్లా నాయక్’ అంచనాలు అందుకొని భారీ బ్లాక్ బస్టర్ గా మారితే, నిత్య మీనన్ కి మళ్ళీ క్రేజ్ పెరుగుతుంది. నిత్య కూడా అదే అంచనా వేస్తోంది.

ఈ భామ తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోల సరసన నటించింది.

More

Related Stories