
‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది. ఆమె తప్పుకుంది. ఆ తర్వాత కీర్తిసురేష్ పేరు వినిపించింది. తను ప్రాజెక్టులో లేనంటూ కీర్తి స్వయంగా ప్రకటించింది.
ఆ తర్వాత మృణాల్ పేరు వినిపించింది. దాదాపు ఆమె పక్కా అనుకున్నారు. కానీ మృణాల్ కూడా ‘ఎల్లమ్మ’ లో చేరలేదు. ఇలా ఈ సినిమా చుట్టూ చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఆ లిస్టులో తన పేరు కూడా ఉందని తాజాగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కూడా బయటపెట్టింది.
“అవును.. ‘ఎల్లమ్మ’ సినిమా నాకు కూడా వచ్చింది. అది చాలామంచి కథ. కానీ అందులో నేను నటించలేకపోయాను. ఆ టైమ్ లో నేను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. ‘ఎల్లమ్మ’ కు టైమ్ కేటాయించలేకపోయాను. అందుకే చేయలేనని చెప్పాను.”
ఇలా ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టు తన దగ్గరకు కూడా వచ్చిన విషయాన్ని బయటపెట్టింది భాగ్యశ్రీ. వరుసగా పీరియాడిక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, మరికొన్ని రోజుల్లో ‘లెనిన్’ సినిమాతో థియేటర్లలోకి వస్తోంది.
