అందరు హీరోలకు సమదూరంలో ఉంటాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ప్రతి హీరోకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు.. అదే టైమ్ లో తెరవెనక ప్రతి హీరోతో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. అందుకే దేవిశ్రీని అందరూ ఇష్టపడతారు.
అయితే తనకు తెలియకుండానే మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు దేవిశ్రీ. తాజాగా నిర్వహించిన కన్సర్ట్ వల్ల, సోషల్ మీడియాలో ఇతడు ట్రోలింగ్ కు గురికావాల్సి వచ్చింది.
గచ్చిబౌలిలో జరిగిన లైవ్ కన్సర్ట్ సూపర్ హిట్టయిందంటున్నారు చాలామంది. కేవలం పాటలకే పరిమితం కాకుండా, వివిధ సినిమాల్లోని థీమ్ మ్యూజిక్స్ ను ప్లే చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు దేవిశ్రీ.
అయితే ఈ కన్సర్ట్ లో మహేష్ సాంగ్స్, అతడి సినిమాల్లోని థీమ్ సాంగ్స్ కు పెద్దగా చోటివ్వలేదంట దేవిశ్రీప్రసాద్. ఇదే మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అందరు హీరోల సాంగ్స్ ను ఆలపించిన దేవిశ్రీ, మహేష్ పాటల్ని మాత్రం లైట్ తీసుకున్నాడట. పైగా మహేష్ నటించిన ఓ సినిమాలో థీమ్ మ్యూజిక్ ను మొదలుపెట్టి, సాంకేతిక కారణాల వల్ల మధ్యలోనే ఆపేశాడని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దేవిశ్రీపై విరుచుకుపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…