“దేవర” సినిమా సెట్స్ పైకి వచ్చి, కొన్ని రోజుల షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొరటాల శివ ఈ విషయాన్ని ప్రకటించాడు.
అసలు సినిమాను 2 భాగాలుగా చేయాలనే నిర్ణయం వెనక ఏం జరిగిందనేది బయటపెట్టాడు.
“కథ రాసుకుంటూ వెళ్లాం. పాత్రలు అద్భుతంగా వచ్చాయి, సన్నివేశాలు చాలా చక్కగా వచ్చాయి. నిడివి కాస్త ఎక్కువ అవుతుందని తెలిసి మరీ షూటింగ్ కు వెళ్లాం. అవసరమైతే 3 గంటల సినిమాగా విడుదల చేయాలనేది ప్లాన్. అయితే ఎప్పుడైతే మేం షూట్ చేసిన రష్, ఎడిటింగ్ పని మొదలైందో, అప్పుడు ఎడిటర్ నుంచి కాల్ వచ్చింది. సర్.. ఈ రష్ మొత్తాన్ని ఎడిట్ చేసి మీరు అనుకున్న లెంగ్త్ లో కట్ చేయడం చాలా కష్టం. మంచి ఫుటేజ్ పోతోంది, 2 భాగాలు చేయడం మంచిదని అన్నారు. అప్పుడే మాకు ఆలోచన వచ్చింది.”
ఇలా దేవర రెండు భాగాలుగా మారిన విధానాన్ని బయటపెట్టాడు కొరటాల శివ.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “దేవర” ఫీవర్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కటౌట్లకు రక్తాభిషేకాలు చేస్తున్నారు. అటు ఓవర్సీస్ లోఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 2 మిలియన్ డాలర్లు దాటేసింది.
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…