వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు నితిన్. ఓవైపు అలా ఫ్లాపులొస్తున్నాయి. మరోవైపు ‘తమ్ముడు’ సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయలేదు. “అంకుల్ మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి” అంటూ దిల్ రాజుకు కబురు పెట్టాడు.
మొత్తానికి చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడు నితిన్. సినిమా హిట్టయితే అతడికి మరికొంత ముట్టేది. కానీ డిజాస్టర్ అవ్వడంతో, నితిన్ కు అదే ఫైనల్ పేమెంట్ గా మారింది.
ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ఈ హీరో తన నెక్ట్స్ సినిమాకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదంట. తన తదుపరి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తున్నాడు నితిన్. దాని పేరు ‘ఎల్లమ్మ’. బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం తనకు డబ్బులు వద్దని చెప్పేశాడట నితిన్.
‘తమ్ముడు’ సినిమాకు విడుదలకు ముందు పాక్షికంగా పేమెంట్ తీసుకున్న ఈ హీరో, ‘ఎల్లమ్మ’ సినిమాకు మాత్రం సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ తీసుకుంటానని, లేకపోతే ఒక్క పైసా కూడా వద్దని నిర్మాతకు చెప్పేశాడట. ప్రస్తుతానికి ఇది పుకారే అయినప్పటికీ, నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, నితిన్ కు ఇప్పుడు పారితోషికం కంటే సక్సెస్ అవసరం.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…