కొన్ని సినిమాలు సెట్స్ పై ఉంటుంటగానే ఆ మూవీ రిజల్ట్ యూనిట్ కు తెలిసిపోతుంది. మరికొన్ని సినిమాలు ఫస్ట్ కాపీ చూసినప్పుడే తెలిసిపోతుంది. గోపీచంద్ ఇలాంటివి బాగా పసిగడుతుంటాడు, ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి వరుణ్ తేజ్ కూడా చేరాడు. ‘గాండీవధారి అర్జున’ సినిమా గురించి మాట్లాడాడు.
“నేను ఎంచుకున్న కొన్ని కథలు జనాలకు కనెక్ట్ అవ్వట్లేదు. స్క్రిప్ట్ లో కూడా తప్పులున్నాయి. రిలీజ్ కు ముందే సినిమాపై ఎక్సయింట్ మెంట్ పోయింది. ‘గాండీవధారి అర్జున’ టైమ్ లో కరోనా. ఇంట్లో కూర్చొని ఓటీటీలు చూడ్డం వల్ల ఆ సినిమాల ప్రభావం బాగా పడింది. అలా ‘గాండీవధారి అర్జున’ ఓకే చేశాను. రెడీ అయిన తర్వాత చూస్తే సినిమా మొత్తం ఒకటే ఉంది, ఎవ్వరికీ కనెక్ట్ అయ్యేలా లేదు అనిపించింది. రిలీజ్ కు ముందే నాకు ఆ సినిమాపై ఓ ఐడియా వచ్చేసింది.”
‘గని’ హిట్టయితే ‘గాండీవధారి అర్జున’కు కనీసం ఓపెనింగ్స్ ఉండేవని.. కానీ ‘గని’ థియేటర్లలోకి రాకముందే ‘గాండీవధారి అర్జున’ షూట్ మొదలవ్వడంతో తను ఏం చేయలేకపోయానంటున్నాడు.
‘మట్కా’ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు వరుణ్ తేజ్. ఇందులో హీరోకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయి, అతడిలో మార్పు వచ్చి, మంచోడిగా మారినట్టు చూపించలేదని, అతడి పాత్రను యథాతథంగా ప్రజెంట్ చేశామని చెబుతున్నాడు. 14న వస్తోంది ‘మట్కా’.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…