నయనతార (Nayanthara) పారితోషికం విషయంలో అసలు తగ్గేదే లే అనే పద్దతిలో ఉంటుంది. “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రం విషయంలో కూడా చెయ్యాలా వద్దా అని చాలా రోజులు ఊగిసలాడింది. 15 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టి చివరికి 8 కోట్లు ప్లస్ జీఎస్టీ పారితోషికానికి ఒప్పుకొంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చిత్రం, అనిల్ రావిపూడి మీరు మాత్రమే చెయ్యాలి అని పట్టుబట్టడంతో తగ్గింది.
కానీ తాజాగా బాలీవుడ్ చిత్రం విషయంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకుంది అని టాక్.
సల్మాన్ ఖాన్ (Salman Khan), వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త హిందీ చిత్రంలో ఆమె హీరోయిన్. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
బాలీవుడ్లో ఆమె షారుఖ్ సరసన “జవాన్” చిత్రంలో అరంగేట్రం చేసింది. రెండో చిత్రంగా ఇది ఒప్పుకొంది. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఐతే, ఈ సినిమాకి 15 కోట్ల పారితోషికం విషయంలో ఆమె తగ్గ లేదు. 13 కోట్లు ప్లస్ జీఎస్టీకి ఒప్పించింది. అంటే దాదాపుగా 15 కోట్లు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…