సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel) అలియా భట్ (Alia Bhatt)కి మద్దతుగా పోస్ట్ పెట్టింది.
ఇటీవల హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)తెగ ట్రోలింగ్ కి గురి అయింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పైకి వెళ్లి అలియా భట్ కెమెరామెన్ లకు ఫోజులి ఇచ్చింది. కానీ ఒక్క అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ ఆమెని పట్టించుకోలేదు. కెమెరాలో బంధించలేదు. ఆమెని ఎవరూ పట్టించుకోకుండా ఇతర అంతర్జాతీయ సెలెబ్రిటిలను ఫోటోలు తీస్తూ బిజీ అయిపోయారు. ఆ విడియో వైరల్ అయింది.
“ఇటీవలి సంఘటనలు మన భారతీయ మనస్తత్వం తెలియచేశాయి. ఇతరులను కించపరచడమేనా మన పద్దతి. మనం ఒకే జాతిగా, ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటాం – కానీ నిజానికి మనం ఉన్నామా?,” అని ఆమె పోస్ట్ లో పేర్కొంది.
“హాలీవుడ్ తారలు తమ దేశంలో తమ సొంత ప్రజల చేత ట్రోల్ చేయబడే దానికంటే, ఇక్కడి భారతీయ నటులు మన సొంత ప్రజల చేత మరింత దారుణంగా ట్రోల్ చేయబడుతున్నారు, ఇది చాలా విచారకరం! అంతర్జాతీయ కార్యక్రమాలలో ఒక భారతీయ తార కనిపిస్తే… ఆ తార సొంత ప్రజల నుంచే ట్రోలింగ్ కి గురి అవుతున్నారు . ఇది ఎంత సిగ్గుచేటు?” అని మరో పోస్ట్ లో అలియా భట్ పేరు పెట్టకుండా ఆమెకి మద్దతుగా రాశారు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…