సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ తన భార్యతో విడాకుల గురించి స్పందించారు. ఆయన భార్య సైరా మొదట విడిపోతున్నట్లు ప్రకటించారు. రాత్రి పొద్దుపోయాక రెహమాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
29 ఏళ్ల వారి కాపురానికి ముగింపు పడింది. 30వ యానివర్సరీ జరుపుకుంటామని భావించాను కానీ ఇలా జరిగిందని రెహమాన్ వాపోయారు.
“30కి చేరుకోవాలని భావించాం. కానీ అన్నింటికీ ముగింపు ఉంటుంది అని అర్థం అవుతోంది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. పగిలిన ముక్కలు అతుక్కోవు. అయినా ఈ వేర్పాటులో కూడా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ క్లిష్ట సమయాన్ని దాటే క్రమంలో మాకు అండగా ఉన్న మిత్రులకు ధన్యవాదాలు.”
అది రెహమాన్ స్పందన.
మణిరత్నం తీసిన “రోజా” సినిమాతో ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి చిత్రంతోనే సంచలనం సృష్టించారు. “రోజా” విడుదలైన మూడేళ్లకు సైరాని పెళ్లాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరూ వయసుకు వచ్చినవాళ్ళే. ఇటీవలే అంబానీల పెళ్లి వేడుకలో రెహమాన్, సైరా అన్యోన్యంగా కనిపించారు.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…