తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాణ సంస్థలుగా రాణిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలపై, ఆ సంస్థ అధినేతల, ప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై ఏకకాలంలో ఐటి సోదాలు జరుగుతున్నాయి.
ఇటు మైత్రి సంస్థ అధినేతలైన నవీన్ ఎర్నేని, రవికుమార్, సిఇఒ చెర్రీ ఇళ్లల్లోనూ సోదాలు అవుతున్నాయి.
ALSO READ: IT raids on Dil Raju and Mythri offices
సంక్రాంతి బరిలో దిగిన “గేమ్ చేంజర్”, “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రాలను దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించింది. “పుష్ప 2” సినిమాని మైత్రి సంస్థ తీసింది. ఐతే, “సంక్రాంతికి వస్తున్నాం” ఇప్పటికే 130 కోట్లు కలెక్ట్ చేసింది అని, త్వరలో 200 కోట్లకు పైనే చేస్తుంది అని నిర్మాతలు పోస్టర్లు విడుదల చెయ్యడం, కొందరు జర్నలిస్టులతో ట్వీట్లు వేయించడమే ఈ తిప్పలు అని అర్థమవుతోంది. అలాగే అట్టర్ ఫ్లాప్ అయిన “గేమ్ చేంజర్” కూడా దాదాపు 270 కోట్లు కలెక్ట్ చేసింది అని దిల్ రాజు పోస్టర్ వేశారు.
అటు మైత్రి సంస్థ కూడా దాదాపు “పుష్ప” సినిమా 1900 కోట్లు కలెక్ట్ చేసింది అని పోస్టర్లు విడుదల చేసింది. “సంక్రాంతికి వస్తున్నాం”, “పుష్ప 2” రెండూ భారీ విజయాలే. కానీ వచ్చిన వసూళ్లకు మించి…. చాలా అదనంగా అమౌంట్ కలిపి పోస్టర్లు వేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ కోసం. ఈ పబ్లిసిటీ వల్లే ఐటీ తిప్పలు మొదలు అయ్యాయి అని ఇండస్ట్రీలో కామెంట్స్ వినపడుతున్నాయి.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…