‘L2 ఎంపురాన్’ సినిమా వివాదాస్పదమైన తర్వాత ఆ మూవీకి సంబంధించిన కీలక వ్యక్తులపై ఆదాయపు పన్నుశాఖ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్మాత గోపాలన్ పై ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది ఈడీ.
ఇప్పుడు ‘L2 ఎంపురాన్’ దర్శకుడు ఫృధ్వీరాజ్ సుకుమారన్ వంతు వచ్చింది. ఇతడికి కూడా తాజాగా నోటీసులందాయి. గత 3 చిత్రాల ఆదాయపు వివరాలు ఇవ్వాలంటూ ఐటీ, ఇతడికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 లోపు ఈ నోటీసులకు స్పందించాల్సి ఉంది.
రీసెంట్ గా పృథ్వీరాజ్ 3 సినిమాల్లో నటించాడు. గోల్డ్, జనగణమన, కడువా చితాలవి. ఈ సినిమాలకు అతడు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సహ-నిర్మాతగా లాభాలు తీసుకున్నాడు. దీనిపై ఐటీ ఆరాలు తీస్తోంది.
సహ నిర్మాతగా పృథ్వీరాజ్ సంపాదన 40 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులు దీనిపై పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్కు కూడా ఆదాయపు పన్ను నోటీసులు రావడంతో, అంతా దీనికి ‘ఎంపురాన్’ వివాదంతో ముడిపెడుతున్నారు.
ఆ సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు, అంశాన్ని ఎత్తుకోవడం వల్లనే కొంతమంది ఇలా దర్శకనిర్మాతలను టార్గెట్ చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…