పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన చిరు, అక్కడ సందడి చేస్తున్నారు. భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకారతో కలిసి పారిస్ లో పర్యటిస్తున్న మెగాస్టార్.. అక్కడ్నుంచి రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అభిమానుల్ని అలరిస్తున్నారు.
పారిస్ వీధుల్లో సరదాగా తిరుగుతూ, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు చిరంజీవి.
ఒలింపిక్ టార్చ్ ను పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చారు. అలా వీధుల్లో నడుస్తూ.. భార్యతో కలిసి సెల్పీలు దిగారు. ఇలా ఒకటి కాదు, అడుగడుగునా చిరంజీవిలో ఉత్సాహం కనిపిస్తోంది. ముందుగా లండన్ లో సందడి చేసి, అట్నుంచి అటు పారిస్ వెళ్లిన మెగా కుటుంబం, మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతోంది.
ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో “విశ్వంభర” సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ టూర్ కోసం ఆ సినిమాకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తోంది “విశ్వంభర”.
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…