సమంత మరో వెబ్ సిరీస్ లో నటించబోతోందంటూ మూడు రోజులుగా సోషల్ మీడియా కోడైకూసింది. ఆ వెబ్ సిరీస్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. కానీ సమంత మాత్రం సైలెంట్ అయింది.
రాజ్&డీకే కలిసి ఈ కొత్త వెబ్ సిరీస్ ప్రకటించారు. దీని పేరు “రక్త్ బ్రహ్మాండ్.” నెట్ ఫ్లిక్స్ కోసం వాళ్లు ఈ సిరీస్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే కేవలం సిరీస్ ను మాత్రమే ప్రకటించారు. నటీనటులు ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సమంత సైలెంట్ గా ఉందని కొందరు అంటున్నారు. త్వరలోనే సమంత పేరుతో మరోసారి ఈ సిరీస్ ను హైలెట్ చేస్తారని టాక్.
రాజ్&డీకే తో కలిసి సమంత ఇదివరకే “ఫ్యామిలీ మేన్ సీజన్-2” చేసింది. తాజాగా “సిటాడెల్” ఇండియన్ వెర్షన్ కూడా చేసింది. ఆ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు “రక్త్ బ్రహ్మాండ్”లో కూడా ఆమె ఉందనే టాక్ నడుస్తోంది. ఇలా ఈ రాజ్-డీకేల నిర్మాణంలోనే సమంత వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
సమంత కొత్తగా ఒప్పుకున్న తెలుగు సినిమా కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు.
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…