“కల్కి 2898 AD” సినిమా వచ్చే నెలకు వాయిదా పడింది. ఈ సినిమా విడుదలకు ఇంకా 45 రోజులే మిగిలి ఉంది. కానీ టీం ఇప్పటికీ ప్రమోషన్లు మొదలు పెట్టలేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీ ఈ నెలాఖరు నుంచి షురూ అవుతుంది. ఇక సినిమా ట్రైలర్ మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతే విడుదల అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని నిర్మాత అశ్వనీ దత్ భావిస్తున్నారు. కొత్త గవర్నమెంట్ లో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు సులువుగా దొరుకుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రీ రిలీజ్ ఈవెంట్, భారీ ఇంటర్వ్యూలు, టీజర్ విడుదల వంటివి వరుసగా మొదలవుతాయి.
“కల్కి 2898 AD” సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకుడు. అతను నిర్మాత అశ్వనీ దత్ కి అల్లుడే. ఈ సినిమాలో ప్రభాస్ హీరో కాగా, దీపిక పదుకోన్, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో దర్శనమిస్తారు.
ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లోనే కాదు గ్లోబల్ లెవల్లో విడుదల చెయ్యనున్నారు. గ్లోబల్ ప్రమోషన్స్ మాత్రం త్వరలోనే స్టార్ట్ అవుతాయి.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…