“డబుల్ ఇస్మార్ట్” విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా చుట్టూ ఎన్నో అనుమానాలున్నాయి, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. అయితే ఓ సెక్షన్ మీడియాలో చెప్పుకుంటున్న ఆ భయాలేవీ తనకు లేవంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకే ఒక్క విషయంలో మాత్రం తను భయపడినట్టు వెల్లడించాడు.
“డబుల్ ఇస్మార్ట్ కోసం సంజయ్ దత్ ను తీసుకోవాలని అనుకున్నాం. ఆయనకు వెళ్లి కథ వినిపించాం. ఆయనకు నచ్చింది. కానీ కాల్షీట్లు లేవన్నాడు. ఎందుకంటే, అప్పటికే ఆయన 7 సినిమాలకు ఓకే చెప్పారు. అలాంటి టైమ్ లో మాకు కాల్షీట్లు దొరకడం చాలా కష్టం. సంజూ బాబా కాల్షీట్ దొరుకుతుందా దొరకదా అనే భయంతోనే షూటింగ్ మొదలుపెట్టాం.”
ఇలా సినిమా మొత్తం ఈ ఒక్క భయంతోనే గడిచిపోయిందని వెల్లడించాడు పూరి జగన్నాథ్. బహుశా.. అందుకేనేమో.. సంజయ్ దత్ సెట్స్ పైకి వచ్చిన తొలి షెడ్యూల్ లోనే రామ్-సంజయ్ దత్ మధ్య కీలకమైన క్లయిమాక్స్ పార్ట్ షూటింగ్ ను పూర్తిచేశారు.
ఆ తర్వాత సంజయ్ దత్ కాల్షీట్లు, రామ్ అందుబాటులో ఉన్న రోజుల్ని మ్యాచ్ చేసుకొని మిగతా సీన్స్ పూర్తిచేసినట్టు వెల్లడించాడు పూరి జగన్నాథ్. ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తోంది “డబుల్ ఇస్మార్ట్”.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…