‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్టయింది. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా హిట్టయింది. తర్వాత టీవీల్లోకొచ్చి అక్కడ కూడా హిట్టయింది. ఇలా ఆ సినిమా రన్ అన్ని విభాగాల్లో ముగిసినప్పటికీ, కోర్టులో మాత్రం మొన్నటివరకు ఈ సినిమాపై పెట్టిన కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు అది కూడా క్లియర్ అయింది.
ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు. లెక్కప్రకారం, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఇస్తారు. ఈ సినిమాకు భారీబడ్జెట్ ఖర్చవ్వలేదని, కాబట్టి టికెట్ రేట్ల పెంపు నిర్ణయం సమంజసం కాదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
ఈ సినిమా బడ్జెట్ పై ఈడీతో దర్యాప్తు చేయించాలంటూ లక్ష్మణ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇది కోర్టు పరిధిలోకి రాదని, అధికారుల్ని సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. పైగా ఈ కేసు దాఖలు చేయడం వెనక ప్రజోపయోగం కంటే, సొంత ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోదంటూ అనుమానం కూడా వ్యక్తం చేసింది.
మరీ ముఖ్యంగా సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా గురించి విచారించడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా రిలీజైన టైమ్ లోనే ఆదాయపు పన్నుశాఖ అధికారులు, దిల్ రాజు నివాసాలు, ఆస్తులు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఇదే విషయాన్ని దిల్ రాజు తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…