
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు తెచ్చుకున్న యువ నిర్మాత.. ధీరజ్ మొగిలినేని. సుహాస్ హీరోగా ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించిన తాజా చిత్రం “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
“సుహాస్ కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. “కలర్ ఫోటో”తో హీరో అయ్యాడు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” అతన్ని మరో మెట్టు ఎక్కిస్తుంది,” అని అంటున్నారు ధీరజ్ మొగిలినేని. “కథలో కీలకమైన ఒక సందర్భం కోసం హీరో గుండుతో కనిపించాలి. మేకప్ తో గుండు మేనేజ్ చేయొచ్చు. కానీ సుహాస్ రెండు సార్లు సినిమాకోసం గుండు చేయించుకొని నటించాడు. అది సుహాస్ కమిట్మెంట్,” అని సుహాస్ ని పొగిడారు నిర్మాత.
“ఈ సినిమా ద్వారా సందేశాలు ఇవ్వడం లేదు కానీ నిజంగా జరిగిన ఘటనల నుంచి దర్శకుడు దుశ్యంత్ అల్లిన కథ ఇది. సుహాస్ అక్కగా శరణ్య ప్రదీప్ నటించింది.ఆమె పాత్ర ఈ సినిమాకి ప్రాణం. ఇందులో ఒక కొత్త ఎలిమెంట్ ఉంది,” అని కథ గురించి వివరించారు నిర్మాత.
ఈ సినిమాని అల్లు అరవింద్ చూసి మెచ్చుకున్నారట.
ఈ యువ నిర్మాత రష్మిక మందానతో ఒక సినిమా నిర్మిస్తున్నాడు. “ది గర్ల్ ఫ్రెండ్” పేరుతో రూపొందుతున్న ఆ సినిమాకి దర్శకుడు రాహుల్ రవీంద్రన్.