‘మా’ పోటీ నుంచి తప్పుకున్న సీవీఎల్


‘మా’ ఎన్నికల హడావిడి నాలుగు నెలల క్రితమే మొదలైంది. ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నామని మూడు నెలల క్రితం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. కానీ హేమ, జీవిత రాజశేఖర్ మిడిల్ డ్రాప్ అయ్యారు. లేటెస్ట్ గా పోటీ నుంచి సీవీఎల్ కూడా బయటికొచ్చారు. పోటీలో ఉండట్లేదు.

ఇక రెండు ప్యానల్స్ మాత్రమే మిగిలాయి. ప్రకాష్ రాజ్, విష్ణు మాత్రమే పోటీలో ఉన్నారు.

“నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశాను. నా మానిఫెస్టోను కూడా ప్రకటించాను. కానీ ఇప్పుడు నామినేషన్ ని ఉపసంహరించుకున్నాను. కారణమేంటో తర్వాత చెప్తాను. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం. పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్ లో ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వటం లేదు. మా ఎన్నికల్లో ఎవరు గెలిచిన మా సంక్షేమం కోసం పని చెయ్యాలి,” అని అన్నారు సీవీఎల్.

ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగుతాయి.

Advertisement
 

More

Related Stories