పూజ హెగ్డేకి ఇప్పుడు అవకాశాలు కనుమరుగు అయ్యాయి. ఆమెతో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు ఆసక్తి చూపడం లేదు. దాంతో, పెద్ద దర్శకులు ఆమెని అప్రోచ్ అవ్వడం లేదు.
మే 2022లో విడుదలైన “ఎఫ్ 3” తర్వాత ఆమెకి ఒక్క తెలుగు సినిమాలో అవకాశం రాలేదు. ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిన ఈ భామని వరుసగా ఫ్లాపులు రావడంతో పట్టించుకోవడం మానేశారు నిర్మాతలు. ఐతే, ఈ భామ తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఒప్పుకున్నట్లు సమాచారం.
ఏవీఎం సంస్థ తమిళంలో ఓటీటీ కోసం ఒక సినిమా నిర్మించనుందట. అజయ్ జ్ఞానముత్తు అనే తమిళ దర్శకుడు తీసే ఈ చిత్రంలో మొదట నయనతారని హీరోయిన్ గా అనుకున్నారు. ఐతే, ఆమె చెప్పిన పారితోషికంతో షాక్ తిన్న నిర్మాణ సంస్థ ఇప్పుడు పూజా హెగ్డే కథానాయికగా తీసుకున్నట్లు టాక్.
పూజకి ఇప్పుడు ఇది అవసరం. ఆమె ఇంతవరకు లేడి ఓరియెంటెడ్ చిత్రం కూడా చెయ్యలేదు.
ALSO READ: Pooja Hegde looks pretty in a black outfit